హైదరాబాద్: భారత్ జట్టు తాత్కాలిక సారథి రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కు ఎంపికవడంతో బుమ్రాను ప్రశంసించడం మొదలుపెట్టాడు. బుమ్రా ఎంపికవ్వడం యువ క్రికెటర్లకు ఒక పాఠమని అన్నాడు. అతని కష్టానికి ఇది ప్రతిఫలమని పేర్కొన్నాడు. ఇది మిగిలిన వాళ్లకి ఒక ప్రేరణ కావాలని సూచించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్కు రెగ్యులర్ పేసర్గా ఉన్న బుమ్రా, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కు ఐదో స్పెషలిస్టు బౌలర్గా ఎంపికయ్యాడు.
'టెస్టు జట్టుకు ఎంపిక కావడం బుమ్రా కెరీర్కు కొత్త ఉత్తేజాన్నిస్తుంది. చాన్నాళ్లుగా టెస్టు జట్టులో ఉండాలని అతను ఆరాటంగా ఉన్నాడు. వన్డే, టీ20 ఫార్మాట్లో కృషి ఫలితమే ఇది. ఏడాది కాలంగా బౌలింగ్, ఫిట్నెస్, టెక్నిక్ను మెరుగు పరుచుకున్నాడు. అతను చాలా వృద్ధి సాధించాడు. ముంబయి ఇండియన్స్లో నాతో పాటు ఆడాడు. ప్రతి మ్యాచ్కు అతను మెరుగవ్వడం చూశాను. ప్రతి సిరీస్కు కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో వస్తాడు. ఇప్పటి వరకు దొరికిన సమయంలో జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పెంచుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్లకు చాలినన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. వారు కూడా బుమ్రా విధంగా కష్టపడితే మెరుగైన ఫలితాలు పొందగలరని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.