దూసుకుపోతోన్న One8
కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న One8... పుట్వేర్, క్యాప్స్, ట్రైనింగ్ బ్యాగ్స్, కిడ్స్ వేర్ తదితర ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. One8 బ్రాండ్ ఇప్పటికే రూ. 130 కోట్లను దాటిందని, 2020 ఆర్ధిక ఏడాదికి గాను రూ. 185 కోట్లను తాకుతుందని ఫోర్బ్స్ ఇండియా అంచనా వేసింది. బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్వవహారిస్తోన్న బ్రాండ్లను మించి One8 దూసుకుపోతోంది. 2016లో One8 బ్రాండ్ను మార్కెట్లోకి వచ్చింది.
One8 బ్రాండింగ్లో
ఎ. ఎనర్జీ డ్రింగ్, వాటర్ - ఓషన్ బేవరేజెస్
బి. One8 సుగంధాలు
సి. One8 అండర్ వేర్, ఫ్యాషన్ దుస్తులు
డి. One8 కిడ్స్ వేర్
ఈ. One8 రెస్టారెంట్లు
బ్రాండ్ వార్: కోహ్లీ vs ధోని
విరాట్ కోహ్లీ: Audi, MRF, Pune, Uber, Too Yumm, Star, Vicks, Valvoline, Himalaya, Royal Challengers, American Tourister, Boost, Remit 2 India, Manyavar, Shyam Steel, Vitabiotics, Volini, Luminous, Hero, Colgate, Mobile Premier League, Google Duo, Flipkart.
మహేంద్ర సింగ్ ధోని: Indian Terrain, RedBus, Colgate, Panerai, LivFast, GoDaddy, Bharat Matrimony, Mastercard India, Sumadhura, Snickers India, Orient, NetMeds.com, Sound Logic, WardWiz, SRMB Steel, SportsFit, Zed Black Agarbathis, Gulf Oil India, Dream11, Reebok, Exide Life Insurance, Boost, State of Jharkhand, TVS.
మిగతా క్రీడాకారులు
1. సచిన్ టెండూల్కర్: అరవింద్ మిల్స్ త్వరలో ప్రారంభించనున్న క్లాత్లైన్ ట్రూ బ్లూకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు.
2. ధోని: తన సొంత సంస్థ రితి స్పోర్ట్స్కు సంబంధించిన ఉత్పత్తులు సెవెన్ అనే లైఫ్ స్టైల్ బ్రాండ్ను మార్కెట్ చేస్తుంది.
3. క్రిస్టియానో రొనాల్డో: CR7 బ్రాండ్ను కలిగి ఉన్నాడు. దీంతో పాటు పరిమళ ద్రవ్యాలు, అండర్వేర్, స్పోర్ట్స్ గేర్లను కలిగి ఉన్నాడు.
4. రోజర్ ఫెదరర్: RF అనే సొంత బ్రాండ్ను కలిగి ఉన్నాడు.
విరాట్ కోహ్లీ నెట్ వర్త్
జూన్ 2019 నాటికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులు, బ్రాండింగ్ తదితర వాటి ద్వారా వచ్చే నికర ఆదయం విలువ రూ. 174 కోట్లుగా ఉంది. ప్రపంచంలో అత్యధిక ఆదాయం సంపాదించే అటగాళ్ల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే...
1. లియోనల్ మెస్సీ: Rs 922 crore
2. క్రిస్టియానో రొనాల్డో: Rs 779 crore
3. నెయమార్: Rs 751 crore
4. కానెలో అల్వారెజ్ (బాక్సర్): Rs 672 crore
5. రోజర్ ఫెదరర్: Rs 668 crore