హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాడ్జ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. మూడేళ్ళ పాటు పంజాబ్కు హాడ్జ్ ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. అంటే పంజాబ్ ఎలెవన్ జట్టు పూర్తి బాధ్యతలు బ్రాడ్ హాడ్జ్ చేతిలో పెట్టనున్నారు.
ఇప్పటి నుంచి జట్టుకు సంబంధించిన ప్రతి విషయం ప్రధాన కోచ్ అయిన బ్రాడ్ హాడ్జ్ టీంకు సంబంధించి తనపై స్థాయిలో ఉన్న సెహ్వాగ్ రిపోర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్ టీం డైరక్టర్ హోదాలో సెహ్వాగ్ కొనసాగుతున్న విషయం విదితమే.
ఇప్పటి వరకు టీ 20 సీజన్లలో తనదంటూ ప్రత్యేక స్థానాన్ని బ్రాడ్ హాడ్జ్ కలిగిఉన్నాడు. 256 ఇన్నింగ్స్లలో 7338పరుగులను సాధించాడు. ఇప్పటి వరకు ఇతని యావరేజ్ 37, స్టైక్ రేట్ 132గాఉంది. బ్రాడ్ హాడ్జ్కు గత రెండు సీజన్లలో గుజరాత్ లయన్స్కు హాడ్జ్ కోచ్గా పనిచేశాడు. ఇదే ఇతను మొట్టమొదటిసారిగా కోచ్ గా పనిచేసిన టీమ్ కూడా ఇదే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.