
హైదరాబాద్: ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉందని... అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించవద్దని పర్యావరణవేత్తలు హెచ్చరించినప్పటికీ, మ్యాచ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధృవీకరించడంపై బాలీవుడ్ నటి దియా మిర్జా మండిపడ్డారు.
ఈ మేరకు ఆమె తన ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. తన ట్విట్టర్లో బీసీసీఐని ఉద్దేశిస్తూ "గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ)లో గాలి నాణ్యత 412 ఉన్నప్పటికీ తొలి టీ20 మ్యాచ్తో ముందుకు సాగాలని బీసీసీఐ నిర్ణయించింది. కాలుష్యానికి గురయ్యే ప్రమాదాలను నివారించడానికి... వేగంగా పరిష్కారాలను వెతకడానికి మరియు అమలు చేయగల మన సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది" అని ట్వీట్ చేశారు.