
ప్రధాన ఆకర్షణగా రోహిత్ శర్మ
ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా రోహిత్ శర్మ నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అలవాటు లేని ఓపెనింగ్ స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయనున్నాడు. యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. దక్షిణాఫ్రికాపై మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా తరఫున వీరిద్దరే ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు.

27 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ
భారత్ తరుపున ఇప్పటివరకు రోహిత్ శర్మ మొత్తం 27 టెస్టులు ఆడాడు. 39.62 యావరేజితో 1585 పరుగులు సాధించిన అతడు టెస్టు క్రికెట్లో పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టుల్లో సుస్థిరం చేసుకునేందుకు రోహిత్ శర్మకు ఇది సువర్ణావకాశం. సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్కు ఓపెనర్గా పంపాలని నిర్ణయించాయి.

ఎలా సద్వినియోగం చేసుకుంటాడో
ఈ అవకాశాన్ని రోహిత్ శర్మ ఎలా సద్వినియోగం చేసుకుంటాడన్నది ఆసక్తికరంగా ఉంది. కగిసో రబాడ, వెర్నార్ ఫిలాండర్, లుంగి ఎంగిడి వంటి పేసర్లను ఓపెనర్గా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఎదుర్కోనున్నాడు. దీంతో తొలి టెస్టుకు ముందు అతడికిది మంచి ప్రాక్టీసే అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

రోహిత్కు బ్యాకప్గా గిల్, పాంచాల్
రోహిత్ శర్మ రాణించని పక్షంలో శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ వంటి ఇతర ఓపెనర్లు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల నిలకడగా ఆడుతున్న కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్లతో బోర్డు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు బుమ్రా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న ఉమేశ్ యాదవ్కు ఈ వార్మప్ మ్యాచ్ ఎంతో కీలకం.

వికెట్ కీపర్గా కేఎస్ భరత్
ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఈ మ్యాచ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. టెస్టుల్లో రిషబ్ పంత్కు ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా సెలక్టర్లు భరత్పై దృష్టిసారించిన నేపథ్యంలో అతడు ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ వన్డే వరల్డ్కప్ తర్వాత తొలిసారి మైదానంలోకి దిగుతున్నాడు. ఓపెనర్ మార్క్రమ్ ‘ఎ' జట్టు తరఫున సెంచరీ సాధించి ఫామ్లోకి వచ్చాడు.

ప్రధాన పేసర్గా ఫిలాండర్
చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న ఫిలాండర్ ఈ సిరిస్లో ప్రధాన పేసర్గా బరిలోకి దిగుతున్నాడు. టి20 సిరీస్లో విఫలమైన రబడ టెస్టు సిరిస్లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. మరోవైపు కేశవ్ మహరాజ్, ముత్తుస్వామిల స్పిన్ ఏమేరకు భారత క్రికెటర్లను కట్టడి చేస్తుందో చూడాలి మరి. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు అక్టోబరు 2న విశాఖ వేదికగా ఆరంభం కానుంది.

జట్ల వివరాలు
బోర్డు ఎలెవెన్ : రోహిత్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, కేఎస్ భరత్, జలజ్ సక్సేనా, ధర్మేంద్ర సింగ్ జడేజా, అవేష్ ఖాన్, ఇషాన్ పొరెల్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), బవుమా, డి బ్రుయెన్, డి కాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, సెనురాన్ ముతుస్వామి, ఇన్గిడి, నోర్టె, ఫిలాండర్, పీట్, రబడ, రూడీ సెకండ్.


Click it and Unblock the Notifications












