
ఇక, శుక్రవారం ఉదయం కూడా ఔట్ఫీల్డ్ తడిగా ఉండడంతో అంఫైర్లు మధ్యాహ్నాం టాస్ వేశారు. ప్రస్తుతం 16 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ ఐయిడెన్ మర్క్రమ్(32), జుబెయిర్ హంజ్జా(10) పరుగులతో ఉన్నారు. అంతకముందు జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఓపెనర్ డీన్ ఎల్గర్(6) ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో పాంచాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత పది పరుగుల వ్యవధిలోనే ఇషాన్ పోరెల్ బౌలింగ్లో థియునిస్ డి బ్రూయిన్(6) ఎల్బీగా వెనుదిరిగాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు పాల్గొంటున్నందున ఈ వార్మప్ మ్యాచ్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఇరు జట్ల మధ్య ముగిసిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. ఈ వార్మప్ మ్యాచ్ శనివారంతో ముగియనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు అక్టోబరు 2న విశాఖ వేదికగా ఆరంభం కానుంది. ఈ వార్మప్ మ్యాచ్లో రోహిత్శర్మ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు.
జట్ల వివరాలు
బోర్డు ఎలెవెన్ : రోహిత్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సిద్దేశ్ లాడ్, కేఎస్ భరత్, జలజ్ సక్సేనా, ధర్మేంద్ర సింగ్ జడేజా, అవేష్ ఖాన్, ఇషాన్ పొరెల్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), బవుమా, డి బ్రుయెన్, డి కాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, సెనురాన్ ముతుస్వామి, ఇన్గిడి, నోర్టె, ఫిలాండర్, పీట్, రబడ, రూడీ సెకండ్.