
హైదరాబాద్: ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో భారత జాతీయ జట్టు విజయాన్ని అందుకోలేక తికమకపడుతుంటే ఏ అంచనాలు లేని భారత అంధుల క్రికెట్ జట్టు మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అజేయంగా పోరాడిన జట్టు సరాసరి ఫైనల్కు దూసుకుపోయింది. అంధుల క్రికెట్ ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫైనల్లో ప్రవేశించింది.
బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్ను ఎంచుకుని మొదట బ్యాటింగ్ చేసింది. బంగ్లా 38.5 ఓవర్లలో 256 పరుగులు చేసింది.
భారత ఆటగాడైన దుర్గారావు మూడు వికెట్లు తీయగాదీపక్ మలిక్, ప్రకాశ్ రెండేసి వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. బ్యాట్స్మెన్ గణేశ్భాయ్ మధుకర్ (112; 69 బంతుల్లో) సెంచరీ సాధించడంతో లక్ష్యాన్ని భారత్..మూడు వికెట్లే కోల్పోయి ఛేదించింది.
గణేశ్తో పాటు దీపక్ మలిక్ (53), నరేశ్ (40) విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈనెల 20న షార్జాలో జరిగే తుది సమరంలో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఢీకొంటుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.