
హైదరాబాద్: భారత్లో క్రికెట్కు ఆదరణ అన్ని క్రీడల కంటే ఎక్కువగా ఉంటుందనే విషయం వేరే చెప్పకర్లేదు. కానీ, అంధుల క్రికెట్ విషయంలో కొంచెం తక్కువగానే ఉన్నట్లుంది. పాకిస్థాన్ గడ్డపై అంధుల ప్రపంచ కప్లో భాగంగా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో జట్టును అక్కడికి పంపేందుకు బీసీసీఐ జాప్యం చేసిన సంగతి తెలిసిందే.
అయితే అన్ని అవరోధాలు దాటుకుని వెళ్లిన భారత సేన తన ఖాతాలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 40 ఓవర్లలో 8 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.
సురంగ సంపత్ (68), కేఏ సిల్వా (64) రాణించారు. సునీల్ రమేష్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 32 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దీపక్ 179 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రకాష్ జయరామయ్య (76) కూడా రాణించాడు. భారత్ శుక్రవారం తన తర్వాతి మ్యాచ్లో పాకిస్థాన్ను ఢీకొనబోతోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.