Chahal-Dhanasree: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ జంటకు విడాకులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ దంపతులు పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్, ధనశ్రీ వేర్వేరుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఆ కథనాలను బలపరుస్తున్నాయి. ఒత్తిడి నుంచి విముక్తి లభించిందంటూ ధనశ్రీ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేయగా.. తనను దేవుడే కాపాడాలంటూ యుజ్వేంద్ర చాహల్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
ఆ విశ్వాసమే మంచి జరిగేలా చేస్తుంది: ధనశ్రీ
ధనశ్రీ తన పోస్ట్ లో "ప్రతి ఒక్కరి జీవితంలో మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను దేవుడు కొంతకాలంగా ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. మీరు ఏ రోజైనా ఒత్తిడి, ఆందోళనకు గురైతే మరో అవకాశం ఉంటుందని తెలుసుకోండి. బాధలన్నీ మర్చిపోయి దేవుడిని ప్రార్థిస్తే .. ఆ విశ్వాసమే మంచి జరిగేలా చేస్తుంది." అని ధనశ్రీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

కాపాడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: చాహల్
ఇదిలా ఉండగా.. అంతకు ముందు చాహల్ కూడా ఓ పోస్ట్ పెట్టాడు. తనను ఎల్లప్పుడు ఆ భగవంతుడే కాపాడుతున్నాడని ఆ పోస్ట్ లో తెలిపాడు. దేవుడు తను లెక్కలేనన్ని సార్లు రక్షించాడని.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని గుర్తించేలోపే దేవుడు బయటపడేశాడని తెలిపాడు. ఎల్లప్పుడూ తనకు రక్షణగా ఉన్న దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. చాహల్ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరికీ విడాకులు మంజూరయ్యాయని నెటిజన్లు భావిస్తున్నారు.
ఫ్యామిలీ కోర్టుకు ధనశ్రీ, చాహల్
ధనశ్రీ, చాహల్ విడాకుల కేసుపై ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో గురువారం తుది విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు తమ వివాహాన్ని చట్టబద్ధంగా ముగించారని వార్తలు వినిపిస్తున్నాయి. వినిపిస్తున్న వార్తల ప్రకారం.. గురువారం, ధనశ్రీ వర్మ,యుజ్వేంద్ర చాహల్ తమ విడాకుల కేసులో ముంబై ఫ్యామిలీ కోర్టుకు చేరుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య సమన్వయం లేదని, దీనివల్ల వారు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని, గత 18 నెలలుగా వారు కలిసి జీవించడం లేదని కోర్టులో తెలిపినట్లు తెలిసింది. విడాకులకు ఆమోదం తెలిపే ముందు, కోర్టు వారిద్దరికీ ఒక కౌన్సెలింగ్ సెషన్ను కూడా ఏర్పాటు చేసింది. తద్వారా వారు రాజీకి వచ్చేలా చూసుకున్నారు. అయితే, వారిద్దరూ కలిసి జీవించలేమని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ విడాకులకు కారణం ఏమిటి?
ఈ సమయంలో, ఆ జంట తమ విడిపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పారు. వారి వివాహం ప్రారంభ సంవత్సరాల్లో, వారి మధ్య ప్రతిదీ సాధారణంగానే జరిగిందని, కానీ ఆ తర్వాత వారి మధ్య దూరం పెరగడం ప్రారంభించిందని ఆయన అన్నారు. వారు ప్రతి చిన్న విషయానికి వాదించడం ప్రారంభించారు. తరువాత వారి మధ్య సమన్వయం లేదని వారు గ్రహించారు. దీని తర్వాత వారు కలిసి జీవించకూడదని మరియు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

చాహల్, ధనశ్రీ 2020 లో వివాహం చేసుకున్నారు..
2020లో లాక్ డౌన్సమయంలో యుజ్వేంద్ర చాహల్ , ధనశ్రీ వర్మ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నిజానికి, సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్ వీడియో చూసిన తర్వాత, క్రికెటర్ ఆమెను డ్యాన్స్ నేర్చుకోవడానికి సంప్రదించాడు.ఆ తర్వాత వారిద్దరూ స్నేహితులయ్యారు, అది త్వరలోనే ప్రేమగా మారింది. ధనశ్రీ మరియు యుజ్వేంద్ర డిసెంబర్ 2020 లో వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత, ఈ జంట విడాకులు తీసుకోవడం ద్వారా విడిపోయినట్లు సమాచారం.