
హైదరాబాద్×ముంబై:
ఇప్పటికే ఈ మ్యాచ్కి భువనేశ్వర్ కుమార్ దూరమైనట్లు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. టోర్నీలో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

భువికి ఫిజియోలు విశ్రాంతి కావాలట:
భువనేశ్వర్ జట్టుతో పాటు ముంబై రాలేదు. నడుం నొప్పితో తీవ్రంగా బాధపడుతోన్న భువికి ఫిజియోలు విశ్రాంతి సూచించారు. అందుకే అతడు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో ఆడటం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన ధావన్ ఈ మ్యాచ్కి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నా.

యూసుఫ్ పఠాన్ 100శాతం ఫిట్గా:
యూసుఫ్ పఠాన్ కూడా 100శాతం ఫిట్గా ఉన్నాడని చెప్పలేను. చెన్నై, పంజాబ్తో జరిగిన మ్యాచ్ల్లో రషీద్ ఖాన్ భారీగా పరుగులిచ్చాడు. అతనో వరల్డ్ క్లాస్ బౌలర్. తదుపరి మ్యాచ్లో అతడు పుంజుకుంటాడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

రెండో సారి ముంబైతో:
టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ సీజన్లో రెండోసారి ముంబై ఇండియన్స్తో తలపడుతున్న సన్రైజర్స్ మరోసారి విజయాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన గత మ్యాచ్లో సన్రైజర్స్ వికెట్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












