
లైవ్ అండ్ ఫ్రీ యాక్సెస్
ఎయిర్టెల్ ‘లైవ్ అండ్ ఫ్రీ యాక్సెస్' అంటూ ఐపీఎల్ కవరేజీపై ఇస్తున్న ప్రకటనల్లోనే దానికి వర్తించే షరతులను కూడా పెద్దవైన అక్షరాల్లో, అందరికీ వెంటనే కనిపించే ప్రదేశంలో ఇవ్వాలని కోరుతూ రిలయన్స్ జియో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగానే హైకోర్టు ఆదేశాలు పాటిస్తామని ఎయిర్టెల్ తెలిపింది.

మొత్తానికి హాట్స్టార్ నుంచే ప్రత్యక్ష్య ప్రసారం
ఎయిర్టెల్ ప్రస్తుతం ‘సీజన్ పాస్..' ‘లైవ్ అండ్ ఫ్రీ యాక్సెస్' అంటూ ఐపీఎల్ ప్రకటనలు ఇస్తోంది. అయితే మొత్తానికి హాట్స్టార్ నుంచే ప్రత్యక్ష్య ప్రసారం ఉంటుంది. వీక్షణకు డేటా డౌన్లోడ్ ఛార్జీలు వర్తిస్తాయి. వీటిని ఎవరికీ కనిపించని విధంగా ప్రచురిస్తూ వినియోగదారులను ఎయిర్టెల్ మోసగిస్తోందని, తప్పుదోవ పట్టిస్తోందని జియో తొలుత హైకోర్టులో కేసు వేసింది.

యువతి చెప్పే సీజన్ పాస్ హై.. అనే వాయిస్
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం ప్రింట్ మీడియాలో 12 పిక్సెల్ పరిమాణంలో అక్షరాలను ముద్రించాలని, కనిపించేలా ఉండాలని, ప్రకటన కింది భాగంలో ఉండకూడదని మే 2న ఎయిర్టెల్ను ఆదేశించింది. వీడియో ప్రకటనలో యువతి చెప్పే సీజన్ పాస్ హై.. అనే వాయిస్కు తెరపై పడే అక్షరాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది.

ఎయిర్టెల్ వాస్తవాలను దాచిపెడుతోందని
ఆ తర్వాత జరిగిన పరిణామాలను గోప్యంగా ఉంచి ఎయిర్ టెల్ మోసం చేస్తోందని జియో సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్లో న్యాయబద్ధత ఎంత ఉందా? అని, కొన్ని సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. స్పెషల్ లీవ్ పిటిషన్ను తోసిపుచ్చడంతో జియో ఓడిపోయిందని ఎయిర్టెల్ ప్రచారం చేస్తుండగా కోర్టులో ఏం జరిగిందో చెప్పకుండా ఎయిర్టెల్ వాస్తవాలను దాచిపెడుతోందని జియో వాదిస్తోంది.


Click it and Unblock the Notifications
