
ఫామ్లో ఉన్నా అన్యాయం..
బంగ్లాదేశ్ పర్యటనలో రిషభ్ పంత్ గాయపడినా కూడా టీం మేనేజ్మెంట్ నుంచి సంజూకు పిలుపు రాలేదు. కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్కు అప్పగించారు. ఇలాంటి నేపథ్యంలో టీ20 జట్టులో సంజూకు చోటు దక్కడం అదృష్టమనే చెప్పాలి. అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ చాలా రోజులుగా సెలెక్టర్లు మాత్రం సంజూకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టులో రాణించాలంటే సంజూ ఏం చేయాలి? అనే ప్రశ్న తలెత్తింది. దీనికి శ్రీలంక మాజీ లెజెండ్ సంగక్కర కీలక సూచన చేశాడు.

ఆటను ఎంజాయ్ చేయాలి..
సంజూ ఏ స్థానంలో అయినా ఆడగలడు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలడు. ఆ సత్తా, ట్యాలెంట్ రెండూ సంజూ సొంతం. ఇదే విషయాన్ని సంగక్కర కూడా చెప్పాడు. అయితే ఇదే తనకు దక్కే చివరి అవకాశం అని సంజూ తొందర పడకూడదని సలహా ఇచ్చాడు. ‘ఇదే నా చివరి ఛాన్స్ అని తొందర పడితే నష్టం తనకే. నన్నడిగితే సంజూ ప్రశాంతంగా ఆడాలి. తన ఆటను ఎంజాయ్ చేయాలి. మనం ఎంత బాగా ఆడామనేది తర్వాత ముందు ఆ ఆటను ఎంజాయ్ చేయాలి' అని చెప్పాడు.

ఐపీఎల్ వేరు.. టీమిండియా వేరు..
ఐపీఎల్లో ఆడటం వేరు. టీమిండియాకు ఆడటం వేరు అనే విషయం సంజూ అర్థం చేసుకోవాలని సంగక్కర అన్నాడు. ‘అతను చాలా సింపుల్ విషయం అర్థం చేసుకోవాలి. తన బ్యాటింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. భారత జట్టుకు ఆడే సమయంలో తన పాత్ర ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మైదానంలో దిగినప్పుడు ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉండాలి. మన పాత్రకు ఎలా న్యాయం చేయాలనే విషయంపై ఒక క్లారిటీ ఉండాలి' అని వివరించాడు. తనకు అలవాటు లేని స్థానాల్లో బ్యాటింగ్ చేసే పరిస్థితి సంజూకు రావొచ్చని.. అయితే ఎక్కడైనా ఆడే సత్తా, బలం, నైపుణ్యం అన్నీ సంజూ వద్ద ఉన్నాయని సంగక్కర ధీమా వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications












