న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

"Be Strong": డ్రెస్సింగ్ రూమ్ నుంచి జడేజాను ఉత్సాహపరిచిన రోహిత్

Be Strong: Rohit Sharma Signal To Ravindra Jadeja During Spectacular Knock

హైదరాబాద్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీపైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ కుప్పకూలిన వేళ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సమయోచితంగా ఆడాడు. టీమిండియా వికెట్ కీపర్ ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌)తో కలిసి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు.

జడేజా ఉత్సాహపరిచిన రోహిత్ శర్మ

ఈ క్రమంలో రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డుని నడిపించాడు. దీంతో స్టేడియంలోని అభిమానులతో పాటు ఈ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్‌ శర్మ కూడా జడేజా ఉత్సాహపరిచాడు.

జడేజా హాఫ్ సెంచరీ

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు డ్రెస్సింగ్‌ రూం నుంచే సలహాలు, సూచనలు చేశాడు. ఈ క్రమంలో "బీ స్ట్రాంగ్‌ జడ్డూ. నువ్వు చేయగలవు" అన్నట్లుగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

మరోవైపు ఈ ఓటమితో ఈ ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు.

221 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

221 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం వరుసగా రెండో సారి కూడా సెమీస్‌లోనే ముగియగా, న్యూజిలాండ్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.

Story first published: Thursday, July 11, 2019, 14:16 [IST]
Other articles published on Jul 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X