|
టీమిండియా కొత్త జెర్సీ ఇదే
ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్ స్కై లీ ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
|
టీమిండియా కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించిన బీసీసీఐ
ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం రాహుల్ జోహ్రీ ఇండియన్ క్రికెట్ ఫ్యామిలోకి ఒప్పో మొబైల్స్ని ఆహ్వానించారు. టీమిండియాకు ఒప్పో మొబైల్స్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
|
రూ. 1,079 కోట్లు చెల్లించిన ఒప్పో
ఐదేళ్ల కాలానికి గాను టీమిండియాకు స్పాన్సర్గా వ్యవహరించేందుకు బీసీసీఐకి ఒప్పో రూ. 1,079 కోట్లు చెల్లించింది. ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కుదుర్చుకుంది.
|
కొత్త జెర్సీలతో ఛాంపియన్స్ ట్రోఫీలో
ఈ ఏడాది జూన్ 1 నుంచి లండన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత్ జట్టుని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుని ప్రకటిస్తే ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలను ధరించి అందులో ఆడతారు.