ముంబై: ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతోంది. లీగ్ దశ ముగింపు దశలో ఉంది. ఇంకో మూడు మ్యాచ్లు ముగిశాయంటే.. లీగ్ దశ ఖతమ్ అయిపోతుంది. ఇక సెమీ ఫైనల్, ఆ తరువాత ఫైనల్. ప్రపంచకప్ జగజ్జేతగా ఎవరు ఆవిర్భవిస్తారో తెలియడానికి ఇక ఎంతో సమయం అవసరం లేదు. ఈ నెల 14వ తేదీన ఈ మిస్టరీ తేలిపోతుంది.
మిస్టర్ అండ్ మిసెస్..కూల్ మూవ్మెంట్స్!
ప్రపంచకప్ టోర్నమెంట్లో టీమిండియా క్రికెటర్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. రోహిత్శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, చివరికి విజయ్ శంకర్ కూడా ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్పై తమదైన చెరగని ముద్ర వేస్తున్నారు. ఇదిలావుండగా- టీమిండియాను నడిపిస్తోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఓ ల్యాండ్మార్క్ను అందుకోవడం విశేషం.
We are now 9 million strong - Keep supporting #TeamIndia 🙏👏👏 pic.twitter.com/7kDYh8tOFg
— BCCI (@BCCI) July 4, 2019
బీసీసీఐ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 90 లక్షలను దాటింది. బుధవారం రాత్రి తాము ఈ మైలురాయిని అధిగమించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇదీ ఓ రికార్డుగానే చెప్పుకోవచ్చు. ఏ దేశ క్రికెట్ బోర్డు ట్విట్టర్ అకౌంట్కు కూడా 90 లక్షలకు పైగా ఫాలోవర్లు లేరు. తొమ్మిది మిలియన్ల మంది క్రికెట్ ప్రేమికులు తమను అభిమానిస్తున్నారని, త్వరలోనే కోటిని అధిగమిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది బీసీసీఐ.