
హైదరాబాద్: ఉత్తర్ప్రదేశ్కు చెందిన యువ క్రికెటర్ రింకూ సింగ్పై బీసీసీఐ వేటు వేసింది. వచ్చే మూడు నెలలు అతడు ఏ క్రికెట్ మ్యాచ్లు ఆడకూడదంటూ బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి తీసుకోకుండా ఇటీవల అబుదాబిలో జరిగిన టీ20 టోర్నీలో ఆయన పాల్గొనడమే అతడి వేటుకు కారణమైంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో మూడు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. బోర్డు నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా రింకు సింగ్పై తాత్కాలిక నిషేధాన్ని విధించామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన రింకు సింగ్ ఆ రాష్ట్రం నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా కొనసాగుతున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 21 ఏళ్ల రింకు సింగ్ ఇప్పటి వరకు 19 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. వీటితో పాటు 24 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడాడు.