
కోహ్లీ పేరును పంపించాం
‘ఖేల్రత్న కోసం బీసీసీఐ కోహ్లీ పేరు పంపడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఈ అవార్డు కోసం కోహ్లీ పేరు పంపగా రియో ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్, తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్కు అందించారు. అందుకే ఈ ఏడాది కోహ్లీ పేరును పంపించాం' అని రాయ్ వివరించారు. 29 ఏళ్ల కోహ్లి గత ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. 2013లో అర్జున అవార్డును సొంతం చేసుకున్నాడు.

ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు
టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తోన్న కోహ్లీ ఈ మూడు ఫార్మాట్లలోనూ స్థిరంగా రాణిస్తున్నాడు. అంతేకాదు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ చిరస్మరణీయమైన విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ మరికొన్ని రికార్డులకు చేరువయ్యాడు. ఇక ద్రవిడ్ విషయానికొస్తే..

సునీల్ గవాస్కర పేరును బీసీసీఐ ధ్యాన్చంద్ అవార్డు
భారత అండర్-19 క్రికెట్ జట్టు ఈ ఏడాది ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ఇండియా-ఎ జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మాజీ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత సునీల్ గావస్కర్ పేరును బీసీసీఐ ధ్యాన్చంద్ అవార్డుకు సిఫారసు చేసింది.

శిఖర్ ధావన్, స్మృతి మంధన పేర్లను అర్జున అవార్డులకై:
బీసీసీఐ ఇప్పటికే శిఖర్ ధావన్, స్మృతి మంధన పేర్లను అర్జున అవార్డుల కోసం ప్రతిపాదించింది. సన్రైజర్స్ తరఫున ఐపీఎల్లో బరిలో దిగుతున్న శిఖర్ ధావన్ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఓపెనర్గా ఆడుతున్నాడు. 2013లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. గత ఏడాది భారత మహిళల జట్టు వరల్డ్ కప్ ఫైనల్ చేరడంలో 21 ఏళ్ల మంధన కీలక పాత్ర పోషించింది. ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్లో ఈ బ్యాట్స్ ఉమన్ నాలుగోస్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications












