
ఎన్సీఏ సీఈఓ తుఫాన్ ఘోష్ కూడా
జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) సీఈఓ తుఫాన్ ఘోష్ కూడా చర్చల్లో పాల్గొంటాడు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు గతంలో కొన్ని బీసీసీఐ సాంకేతిక కమిటీ సమావేశాలలో కలిసి పాల్గొన్నారు. ఈ సాంకేతిక కమిటీకి సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమావేశాలకు ద్రవిడ్ ఇండియా అండర్-19, ఏ జట్టు హెడ్ కోచ్గా హాజరయ్యారు.

పునరావాస కేంద్రంగా ఎన్సీఏ
గత కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్కు జాతీయ క్రికెట్ అకాడమీ వాస్తవానికి పునరావాస కేంద్రంగా మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే విషయాన్ని తన తొలి సమావేశంలో ప్రస్తావించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ కొత్త ప్రాజెక్టుపై సౌరవ్ గంగూలీ బుధవారం ద్రవిడ్ను కలవనున్నారు.

సమస్యలపై చర్చించనున్న ద్రవిడ్, గంగూలీ
"గంగూలీ, ద్రవిడ్ జాతీయ క్రికెట్ ఆకాడమీ(ఎన్సీఏ) కోసం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై.. అది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు" అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు రోజుల క్రితం గంగూలీని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ఘనంగా సన్మానించిన సంగతి తెలిసిందే.

వీవీఎస్ లక్ష్మణ్ సైతం
ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైన వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "భారత్ ఇంతలా రాణించేందుకు ప్రధాన కారణం రిజర్వ్ బెంచే. ఈ నేపథ్యంలో గంగూలీ ఇప్పుడు ఎన్సీఏకు మరింత ప్రాధాన్యమిస్తాడని ఆశిస్తున్నా. NCA ద్వారా, చాలా కాలం పాటు భవిష్యత్ ఛాంపియన్లను ఉత్పత్తి చేయవచ్చు. ఎప్పుడైతే రొటేషన్ అవసరమో వారితో ఆ స్థానాలను భర్తీ చేయొచ్చు" అని అన్నాడు.


Click it and Unblock the Notifications












