రెండోసారి..
వాస్తవానికి టీ20 టీమ్స్ ప్రకటించినప్పుడే వన్డే, టెస్ట్లను కూడా ఎంపికచేయాల్సి ఉండగా.. హార్దిక్ పాండ్యా కోసమే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ వాయిదా వేసింది. తొలుత పాండ్యాను భారత్-ఎ టీమ్కు ఎంపికచేసినప్పటికి బౌలింగ్ వర్క్లోడ్ టెస్ట్లో విఫలమవడంతో అతన్ని తప్పించి విజయ్ శంకర్ను పంపింది. ప్రస్తుతం పాండ్యా టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాడు. ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
అందుకే వెయిటింగ్..
టీ20 వరల్డ్కప్ ప్లానింగ్స్లో భాగంగా పాండ్యా జట్టులోకి రావాలని టీమ్మేనేజ్మెంట్ కోరుకుంటుంది. అందుకే కివీస్ పర్యటనలో అతని కోసం ఎదురుచూస్తోంది. ఇక బ్యాక్ సర్జరీ నుంచి కోలుకున్న పాండ్యా ఫిట్నెస్ పరీక్షలో విఫలమవడంతో ఇప్పటికే టీ20లకు దూరమయ్యాడు. ఫిట్నెస్ నిరూపించుకుంటే వన్డే టీమ్లో హార్ధిక్కు ప్లేస్ గ్యారంటీ.
మళ్లీ ఫెయిలైతే..
ఒకవేళ అతను ఫిట్నెస్ నిరూపించుకోకపోతే మాత్రం.. పవర్ హిట్టర్, ముంబై క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక, కేదార్ జాదవ్ కన్నా టెక్నికల్గా మెరుగైన ఆటగాడైన అజింక్యా రహానేను కూడా కివీస్కు తీసుకెళ్లాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ఇక, లిమిటెడ్ ఓవర్లలో కీపింగ్, బ్యాటింగ్లో అదరగొడుతున్న కేఎల్ రాహుల్కు టెస్ట్ టీమ్లో చోటుదక్కే అవకాశం ఉంది. అదనపు పేసర్ కావాలనుకుంటే మాత్రం రైజింగ్ పేసర్ నవ్దీప్ సైనీ టెస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది.