ముంబై: ఆరుగురు క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టి20 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా సెయింట్ లూసియాలోని పబ్ లో గలాటాకు సంబంధించి బిసిసిఐ ఈ నోటీసులు జారీ చేసింది. యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, రోహిత్ శర్మ, పియూష్ చావ్లా, రవీంద్ర జడేజాలకు బిసిసిఐ ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జట్టు మేనేజర్ రంజిబ్ బిశ్వాల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బిసిసిఐ ఆ చర్యలకు దిగింది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తరఫున బోర్డు కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్ క్రికెటర్లకు ఆ నోటీసులు పంపారు. సంఘటనపై తాము వెస్టిండీస్ లో కూడా విచారణ జరిపామని, ఆ సంఘటన వార్తాపత్రికల్లో విస్తృతంగా వచ్చిందని బోర్టు అధికారి రత్నాకర్ శెట్టి చెప్పారు.