For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో ఈ మార్పులు తథ్యం.. బీసీసీఐ స్ట్రాంగ్‌గా చెప్పేసింది

BCCI Informed that From next year the IPL match timings will be at 4pm in afternoon, and the night match at 8 pm

వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల టైమింగ్స్ మార్పునకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాత్రి7.30కు ప్రారంభమవుతున్న మ్యాచ్‌లను వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో రాత్రి 8గంటలకు ప్రారంభించాల్సి ఉంటుందని బీసీసీఐ బ్రాడ్‌కాస్టింగ్ అధికారులకు తెలియజేసింది. అలాగే ఎక్కువగా డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఆడించొద్దని పేర్కొంది. ఒకవేళ మధ్యాహ్నం మ్యాచ్‌లు ఉంటే సాయంత్రం 4గంటలకు మ్యాచ్ ప్రారంభించాలని పేర్కొంది.

ప్రస్తుతం మధ్యాహ్నం ఐపీఎల్ మ్యాచ్‌లు 3.30కు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. 2023-27వరకు ఐదేళ్ల టెలివిజన్, డిజిటల్ హక్కుల కోసం వేలం వేయాలనుకునే ఆసక్తిగల బ్రాడ్‌కాస్టింగ్ పార్టీలకు బీసీసీఐ ఈ మేరకు తెలియజెప్పింది.

 తొలి పదేళ్లలో అలాగే నిర్వహించేవారు

తొలి పదేళ్లలో అలాగే నిర్వహించేవారు

ఐపీఎల్ ప్రారంభమైన మొదటి 10సంవత్సరాల(అంటే రెండు ప్రసారహక్కుల వ్యవధుల కాలం)లో తొలి బ్రాడ్ కాస్టింగ్ వ్యవధి(2008 - 2012), రెండో బ్రాడ్ కాస్టింగ్ సైకిల్ (2013- 2017)లో ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం 4గంటలకు, రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యేవి. ఇక మూడో బ్రాడ్ కాస్టింగ్ (2018-2022) వ్యవధిలో స్టార్ స్పోర్ట్స్ ప్రసార హక్కులను రూ.16,347కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.

స్టార్ స్పోర్ట్స్ అభ్యర్థన మేరకు బీసీసీఐ మ్యాచ్ ల టైమింగ్స్ ను అర్ధగంట ముందుకు జరిపింది. స్టార్ స్పోర్ట్స్ వాదన ప్రకారం.. రాత్రి 8గంటల కంటే 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తే.. ప్రైమ్ టైమ్‌లో అదనంగా 30నిమిషాల వ్యవధి లభిస్తుంది. తద్వారా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది, అలాగే మానిటైజేషన్ కూడా పెరుగుతుంది. అలాగే మధ్యాహ్నం మ్యాచ్‌లను కూడా 30నిమిషాలు ముందుగా మధ్యాహ్నం 3.30కు ప్రారంభించాలని కోరింది. అందుకు బీసీసీఐ సమ్మతించి మ్యాచ్ టైమింగ్స్‌ను మార్చి నిర్వహిస్తోంది.

ఐటీటీ పత్రాల కొనుగోలుకు రేపటి వరకు గడువు

ఐటీటీ పత్రాల కొనుగోలుకు రేపటి వరకు గడువు

మరోవైపు వచ్చే బ్రాడ్ కాస్టింగ్ సైకిల్ (2018 - 22)కోసం ప్రసార హక్కుల కోసం వేలం వేసేందుకు ఐటీటీ పత్రం కొనుగోలుకు బీసీసీఐ చివరి తేదీని 10రోజులు పొడిగించింది. ఆసక్తిగల పార్టీల నుండి వచ్చిన అభ్యర్థనలకు అనుగుణంగా ఐటీటీ పత్రాలను కొనుగోలు చేసే తేదీని మే 20, 2022వరకు పొడిగించింది. రేపటితో గడువు ముగియనుంది. ఐటీటీ పత్రాల కొనుగోలు విధానం, నాన్ రిఫండబుల్ ఫీజు తదితర వివరాలను ఎగ్జిబిట్లో బీసీసీఐ పేర్కొంది.

ఐపీఎల్ వారి పాట మామూలుగా ఉండదు

ఐపీఎల్ వారి పాట మామూలుగా ఉండదు

క్రిక్ బజ్ ప్రకారం.. ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంలో పాల్గొనడానికి స్టార్ ఇండియా, వయాకామ్ 18, సోనీ, అమెజాన్, జీ, డ్రీమ్ 11, సౌత్ ఆఫ్రికాలోని సూపర్‌స్పోర్ట్స్, UKలోని స్కై ఐటీటీ పత్రాన్ని కొనుగోలు చేశాయి. టైమ్స్ ఇంటర్నెట్ కూడా ఆసక్తిని చూపింది. టైమ్స్ ఇంటర్నెట్ అనుబంధ సంస్థ అయిన క్రిక్‌బజ్ ద్వారా ఐటీటీ పత్రాలు కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.

ఐటీటీ పత్రాలు కొనుగోలు చేసిన ప్రసారదారులు అందరూ బిడ్డింగ్‌లో పాల్గొంటారనే గ్యారెంటీ లేదు. ఇది కేవలం ఆసక్తి వ్యక్తీకరణ మాత్రమే. జూన్ 12న బిడ్డింగ్ జరుగుతుంది. బీసీసీఐ వేలంలో కనీస ధరను రూ.32,890కోట్ల భారీ ధరను నిర్ణయించింది. వేలం వేయాలనుకునే వారు అంతకుమించి పాటపాడాలి.

Story first published: Thursday, May 19, 2022, 17:10 [IST]
Other articles published on May 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+