న్యూఢిల్లీ: భారత యువ ఆటగాడు సురేష్ రైనాపై వచ్చిన ఆరోపణలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొట్టివేసింది. బుకీతో సంబంధమున్న మహిళతో రైనా కలిసి వున్నాడని లండన్ నుంచి వెలువడే సండే టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని నిరాధారమైన వార్త అని బీసీసీఐ కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్ అన్నారు. బుకీలతో సంబంధముందన్నట్టు, రైనాపై ఐసీసీకి శ్రీలంక క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వెలువడ్డాయని ఆయన అన్నారు. అయితే వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆయన తెలిపారు. శ్రీలంక బోర్టు వాదనలో నిజం లేదని తెలిపే వీడియోలను శ్రీలంక బోర్డుకు బిసిసిఐ అందజేసింది.