హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫిట్నెట్ సాధించాడు. వెన్ను గాయంతో ఇంగ్లాండ్ పర్యటన నుంచి భువనేశ్వర్ కుమార్ తప్పుకుని అర్ధంతరంగా స్వదేశానికి తిరిగిన వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ అతడు ఫిట్నెట్ సాధించినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంగ్లాండ్తో టీ20లు, వన్డే సిరీస్ల్లో ఆడిన భువనేశ్వర్.. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు గాయంతో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్ ఆకాడమీలో ఉంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్న భువి.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు.
ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో అతడు ప్రస్తుతం భారత్లో జరుగుతున్న చరుత్ముఖ సిరిస్లో ఇండియా-ఏ జట్టు తరుపున ఆడనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్న ఇండియా-ఏ జట్టు తరుపున భువనేశ్వర్ కుమార్ ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో బుధవారం ఇండియా-ఏ జట్టు తలపడనుంది.
ఇండియా ఏ జట్టు:
Shreyas Iyer(captain), Prithvi Shaw, Ravikumar Samarth, Suryakumar Yadav, Hanuma Vihari, Nitish Rana, Sanju Samson, Mayank Markande, Krishnappa Gowtham, Krunal Pandya, Deepak Chahar, Mohammed Siraj, Shivam Mavi, K Khaleel Ahmed, Ambati Rayudu.