హైదరాబాద్: న్యూ ఢిల్లీలో సోమవారం బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సమావేశమైంది. ఇందులో కొన్ని కొత్త సూచనలను తీసుకొచ్చింది. 2023 ప్రపంచ కప్ వన్డే సిరీస్ ను ఉద్దేశించి జరిగిన సమావేశంలో జరిపిన ముఖ్యాంశాలు.
అవి:
1. 2019-2020 సీజన్కి గాను అఫ్ఘనిస్థాన్ జట్టుతో భారత్ టెస్ట్ మ్యాచ్లో తలపడనుంది.
2. 2023 ప్రపంచ కప్ 50 ఓవర్ల వన్డే మ్యాచ్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంతకుముందు 2011 ప్రపంచ కప్ మ్యాచ్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ధోని సారథ్యంలో జరిగిన ఈ సిరీస్లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.
3. తర్వాత జరగనున్న ఛాంపియన్ ట్రోఫికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇలానే 2006లో భారత్ ఆతిథ్యమిచ్చిన ట్రోఫీలో ఆస్ట్రేలియా గెలిచింది.
4. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్పై ఉన్న నిషేదాన్ని కొనసాగించదలచింది.
5. భారత క్రికెటర్లకు డోపింగ్ టెస్టు నిర్వహిస్తామంటున్న నాడాను వ్యతిరేకిస్తున్న బీసీసీఐ అదే పంథాను కొనసాగిచనుంది.
6. 2019 నుంచి కొత్త ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్ టీ పీ)ని అమలులోకి తేనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.