హైదరాబాద్: టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎమ్మెస్కే ప్రసాద్ నియమితులయ్యారు. సందీప్ పాటిల్ స్థానంలో ఆయనను ఎంపిక చేశారు. ప్రస్తుతం అతను టీమిండియా సెలక్టర్గా ఉన్నాడు. గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ గతంలో వికెట్ కీపర్గా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. బుధవారం నాడు ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని బీసీసీఐ ఎంపిక చేసింది. దీనికి ఎమ్మెస్కే ప్రసాద్ చైర్మన్గా ఎంపికయ్యారు.

ఎమ్మెస్కే ప్రసాద్ వయస్సు 41. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఇతను అంతర్జాతీయ క్రికెట్లో ఆరు టెస్టు మ్యాచులు, 17 వన్డేలు ఆడారు. సెలక్షన్ ప్యానెల్లో గగన్ ఖోడా మళ్లీ స్థానం దక్కించుకున్నాడు. కొత్తగా దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజీ, సందీప్ సింగ్లు ఎంపికయ్యారు.
టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎమ్మెస్కే ప్రసాద్ నియమితులయ్యారు. సందీప్ పాటిల్ స్థానంలో ఆయనను ఎంపిక చేశారు. ప్రస్తుతం అతను టీమిండియా సెలక్టర్గా ఉన్నాడు. గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.