ముంబై: ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ ముగిసిన వెంటనే- ఇక దేశవాళీ క్రికెట్ పండగ ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన 2019-2020 వార్షిక షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. రంజీమ్యాచ్లు, వివిధ ట్రోఫీలకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్లు వచ్చే నెల నుంచి ఆరంభం కానున్నాయి.
దులీప్ ట్రోఫీతో దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభమౌతుంది. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ వచ్చేనెల 17వ తేదీన జరుగనుంది. అనంతరం విజయ్ హజారే, ప్రొఫెసర్ దేవ్ధర్, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీల్లో భాగంగా మ్యాచ్లు కొనసాగుతాయి. ట్రోఫీల హడావుడి ముగిసిన అనంతరం రంజీ ట్రోఫీ లీగ్, నాకౌట్ దశ మ్యాచ్లను ఆడతారు. ఇవి ముగిసిన వెంటనే ఇరానీ ట్రోఫీ ఆరంభమౌతుంది.
ఈ సీజన్ ముగుస్తుంది. 365 రోజుల్లో మొత్తం 2036 మ్యాచ్లను ఆడబోతున్నారు రంజీ క్రికెటర్లు. కల్నల్ సీకే నాయుడు, వినూ మన్కడ్, కూచ్ బెహర్, విజయ్ మర్జంట్, విజ్జీ ట్రోఫీ మ్యాచ్లను వాటికి అదనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది పొడవునా రంజీ మ్యాచ్లు క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయబోతున్నాయి.
వీడియో: గుజరాతీ మహిళ హల్చల్: చేతిలో పాక్ జెండా..హేట్ నరేంద్ర మోడీ అంటూ నినాదాలు!