హైదరాబాద్ ఆటగాడికి చోటు:
ధ్రువ్తో పాటు కుమాల్ కుషాగ్ర కూడా జట్టులో వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ జట్టులో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకి చోటు దక్కింది. తిలక్ జట్టులో ప్రముఖ బ్యాట్స్మన్గా కొనసాగనున్నాడు. తిలక్తో పాటు యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా, శషావత్ రావత్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు.
గ్రూప్-ఎలో టీమిండియా:
అండర్-19 విభాగంలో ఇది 13వ ప్రపంచకప్. ఈ మెగా ఈవెంట్ను దక్షిణాఫ్రికాలో రెండోసారి నిర్వహిస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీ జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. టీమిండియా గ్రూప్-ఎలో ఉంది. టీమిండియాతో పాటు జపాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు గ్రూప్-ఎలో ఉన్నాయి.
మంచి సమతుల్యం ఉంది:
2018లో పృథ్వీ షా నేతృత్వంలోని టీమిండియా న్యూజిలాండ్లో ఆస్ట్రేలియాను ఓడించి కప్ గెలిచింది. అప్పడు అండర్-19 జట్టు కోచ్గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఇప్పుడు కూడా మన అండర్ -19 జట్టు ప్రపంచకప్ టైటిల్ను గెలుస్తుందని జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ ద్రవిడ్ ధీమా వ్యక్తం చేసాడు. జట్టులో మంచి సమతుల్యం ఉంది అని పేర్కొన్నాడు.
|
భారత జట్టు:
ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాన్ష్ సక్సేనా, శషావత్ రావత్, దివ్యాన్ష్ జోషి, శుభంగే హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తిక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమాల్ కుషాగ్ర, సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.