హైదరాబాద్: ఆసియా కప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సెలక్టర్లు ముంబైలోని వాంఖడె స్టేడియంలో సమావేశం కానున్నారు.
సెప్టెంబరు 15న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆరంభమయ్యే ఆసియా కప్లో భారత్ సహా ఆరు జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో పాకిస్థాన్తో రెండు అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఉన్న నేపథ్యంలో సీనియర్లు ఎవరికీ విశ్రాంతి ఇవ్వకపోవచ్చు.
మరోవైపు యువ ఆటగాళ్లు మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్లతో పాటు యోయో టెస్టు పాసైన అంబటి రాయుడు జట్టులో ఎంపిక అవతాడో లేదో చూడాలి. ఆసియా కప్ టోర్నీ కోసం బంగ్లాదేశ్ ఇప్పటికే తన జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే.