
తెలుగు ఆటగాళ్లకు చోటు:
కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానెతో పాటు వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహాను బీసీసీఐ ఎంపిక చేసింది. తుది జట్టులో మాత్రం పంత్ ఆడనున్నాడు. రెగ్యులర్ టెస్టు ఆటగాళ్లు అయిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారికి జట్టులో స్థానం లభించింది. గాయం కారణంగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో ఆడలేకపోయిన స్టార్ ఆల్రౌండర్ రవీందర్ జడేజా తిగిరి జట్టులోకి వచ్చాడు. తెలుగు ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, హనుమ విహారిలకు జట్టులో చోటు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్లు పేస్ విభాగంలో ఎంపికయ్యారు.

అందుబాటులోకి కేన్:
డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే న్యూజిలాండ్ జట్టును కూడా కివీస్ బోర్డు మంగళవారమే ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో రెండో టెస్టుకు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అతడు మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కీపర్ బీజే వాట్లింగ్ కూడా అందుబాటులోకి వచ్చాడు. కోలిన్ డీ గ్రాండ్హోమ్ను స్పెషలిస్ట్ ఆల్రౌండర్గా.. అజాజ్ పటేల్ను స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎంపికచేశారు. సౌథాంప్టన్ పిచ్ పేస్కి అనుకూలించనుండడంతో.. అజాజ్ పటేల్ రూపంలో కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్కి టీమ్లో కివీస్ చోటిచ్చింది. ఇక బ్యాకప్ కీపర్గా టామ్ బ్లండెల్ ఎంపికయ్యాడు.
భారత్-న్యూజిలాండ్ జట్లు:
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానె(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(కీపర్), సాహా(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్.


Click it and Unblock the Notifications












