
మూడు జట్లతో మహిళల టీ20 ఛాలెంజ్
2018నుంచి బీసీసీఐ మహిళల టీ20 ఛాలెంజ్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చివర్లో మూడు జట్లతో ఈ ఛాలెంజ్ను నిర్వహిస్తున్నారు. భారత్తో పాటు ఇతర దేశాల ప్లేయర్లు కూడా ఈ పోటీలో ఆడుతున్నారు. అయినప్పటికీ మెన్స్ ఐపీఎల్ మాదిరిగానే చాలా మహిళల ఐపీఎల్ కూడా జరగాలని ఇటీవల డిమాండ్లు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ను నిర్వహిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 'మేము పూర్తి స్థాయి డబ్ల్యుఐపిఎల్ని కలిగి ఉండటానికి అన్ని మార్గాలు చూస్తున్నాం. ఇది కచ్చితంగా జరగబోతోంది. వచ్చే ఏడాది (2023) నుంచి పూర్తిస్థాయి మహిళల ఐపిఎల్ను ప్రారంభించడానికి చాలా మంచి సమయం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మెన్స్ ఐపీఎల్గా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో మనందిరికీ తెలిసిందే' అని గంగూలీ అప్పట్లో చెప్పాడు.

ఆసక్తి కనబర్చుతున్న ఫ్రాంచైజీలు
ఇకపోతే ఐపీఎల్ ఫ్రాంచైజీ సంస్థలయిన రాజస్థాన్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్, ది నైట్ రైడర్స్ గ్రూప్ యజమానులు వుమెన్స్ ఐపీఎల్ జట్లను సొంతం చేసుకోవడానికి తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో మహిళల ఐపీఎల్కు సంబంధించిన అంశాలపై బీసీసీఐ పూర్తి డిటైల్స్ రిలీజ్ చేస్తుందని, అంతలోపు జట్లను సొంతం చేసుకోవడానికి డబ్బులు అరెంజ్ చేసుకోవడాని ఈ ఫ్రాంచైజీలతో పాటు పలు కొత్త యజమానులు సైతం రెడీ అవుతున్నారు. ఇక వుమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల అమ్మకానికి సైతం భారీ డిమాండ్ ఉండొచ్చు.


వుమెన్స్ టీంకు పెరిగిన ఆదరణ
ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఇండియా వుమెన్స్ టీం మెరుగైన ప్రదర్శన కనబర్చుతుంది. భారతదేశంలో మహిళల క్రికెట్ పట్ల మునుపెన్నడూ లేని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. బర్మింగ్హామ్లో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ తదితర స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడడానికి తాము సై అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు మిథాలీ రాజ్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో పాల్గొనడానికి తాను ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications












