మొహాలి: మ్యాచ్ ఫిక్సింగ్ చట్టాన్ని సవరించి బెట్టింగ్ను న్యాయబద్ధం చేస్తే.. భారత క్రికెట్లో అవినీతిని అరికట్టొచ్చు అని బీసీసీఐ అవినీతి నిరోధ విభాగం (ఏసీయూ) హెడ్ అజిత్ సింగ్ షెకావత్ పేర్కొన్నాడు. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో ఫిక్సింగ్ కలకలం రేగింది. ఏసీయూ విచారణలో ఈ ఫిక్సింగ్ భూతం బయటపడింది.
కలెక్టర్కు పిటిషన్: పీవీ సింధుతో వివాహం చేయాలి.. లేదంటే అపహరించి పెళ్లి చేసుకుంటా!!
మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాల నేపథ్యంలో అజిత్ సింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడాడు. 'స్పాట్ ఫిక్సింగ్ను ఏం చేసినా మనం అరికట్టలేం. దీనికి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చట్టం అవసరం. ఫిక్సింగ్పై స్పష్టమైన చట్టం ఉంటే పోలీసులు ఇంకా మెరుగ్గా పనిచేస్తారు. బెట్టింగ్ను చట్టబద్ధం చేయడం వల్ల అవినీతిని నియంత్రించవచ్చు. నిబంధనలు పక్కాగా రూపొందించినప్పుడు నియంత్రణ సాధ్యం అవుతుంది. ఇది ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయాన్ని తెస్తుంది. ఎక్సైజ్ విభాగం ఆదాయానికి దగ్గరగా ఉంటుంది. క్రీడలపై పెడుతున్న బెట్టింగ్ డబ్బు మనసును కదిలించేలా ఉంటుంది' అని అజిత్ సింగ్ పేర్కొన్నారు.
'బెట్టింగ్ను చట్టబద్ధం చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. అలాంటప్పుడే నియంత్రణకు అవకాశం ఉంటుంది. బెట్టింగ్ చట్టబద్ధం కావాలని నేను ప్రత్యేకంగా చెప్పను, కాని దానిని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం బెట్టింగ్ చట్టబద్ధం కాదు. ఒక్కసారి చట్టం చేశారంటే ఎవరు బెట్టింగ్ చేస్తున్నారు?, ఎంత చేస్తున్నారో కూడా డేటా లభిస్తుంది. దాంతో చట్టవ్యతిరేకులకు కష్టం అవుతుంది' అని అజిత్ సింగ్ తెలిపారు.
'ఇప్పుడు కేవలం వందల నుంచి వేల రూపాయల్లో జరిమానా మాత్రమే విధిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి. స్టేట్ రన్ లీగ్లలో అవినీతి నిరోధకతను మేము పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఆటగాళ్ళపై నిఘా ఉంచడానికి మా అధికారులు టీం హోటళ్ళలో ఉండడం కూడా ఇదే మొదటిసారి. అవినీతి నిరోధక తరగతులను కూడా నిర్వహిస్తాము' అని అజిత్ సింగ్ చెప్పుకొచ్చారు.