For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ చేతిలో భారత్ ఓటమి: బంగ్లా అభిమాని ఆత్మహత్య

ది ఓవల్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫైనల్లో భారత ఆటగాళ్లు కనీసం పోరాడకుండా ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోత

By Nageshwara Rao

హైదరాబాద్: ది ఓవల్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫైనల్లో భారత ఆటగాళ్లు కనీసం పోరాడకుండా ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో భారత్‌లో పలు చోట్ల టీవీలను పగలగొట్టడంతో పాటు, క్రీడాకారుల దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేశారు. ఇదంతా భారత్‌‌లో జరిగితే టీమిండియా ఓటమి బంగ్లాదేశ్‌కు చెందిన ఒక వీరాభిమానిని ఆత్మహత్యకు ప్రేరిపించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కోహ్లీసేన ఓటమి తర్వాత బంగ్లాకు చెందిన బిద్యుత్(25) అనే అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

Bangladeshi fan commits suicide after India's final defeat

టీమిండియా ఓటమి పాలైన కొద్ది సేపటికే వేగంగా వెళుతున్న రైలుకి ఎదురెళ్లి అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు ఢాకా పోలీస్ అధికారి నాసిరుల్ ఇస్లామ్ తెలిపారు. జమల్ పూర్‌కు చెందిన బిద్యుత్ షాంగ్ గేట్ ప్రాంతంలో ఒక చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. అనంతరం 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో భారత్‌పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించి తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+