ఢాకా: క్రికెట్ బంతి ఓ నిండి ప్రాణాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ క్రికెట్ మ్యాచ్లో అంపైర్గా ఉన్న 17 ఏళ్ల బాలుడికి బంతి తాకడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఢాకాలోని బలూర్ మాత్ గ్రౌండులో శుక్రవారం రాత్రి కొందరు యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్కు రఫీకుల్ ఇస్లాం అనే బాలుడు అంపైర్గా ఉన్నాడు.

ఈ క్రమంలో ఓ బంతి వచ్చి అతడి ఛాతికి తగిలింది. దీంతో అతను అక్కడే కుప్పకూలాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.