ఢాకా: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రఫె బిన్ మోర్తజా డెంగ్యూ జ్వరంతో శుక్రవారం ఆస్పత్రిలో చేరాడు. ఢాకాలోని అపోలో ఆస్పత్రిలో మోర్తజాకు చికిత్స అందిస్తున్నారు. మోర్తజాకి జ్వరం ఎక్కువగా ఉందని అతని స్నేహితుడు చెప్పాడు.
మోర్తజా అనారోగ్యం కారణంగా బంగ్లా నేషనల్ లీగ్కు దూరమయ్యాడు. మోర్తజా ఆరోగ్య పరిస్థితి గురించి బంగ్లా క్రికెట్ బోర్డు ఫిజీషియన్ దేబాషిశ్ చౌదరి వివరించారు.
మోర్తజాకు చికిత్స చేస్తున్న డాక్టర్తో మాట్లాడినట్లు తెలిపారు. మోర్తజాకి డెంగ్యూ ఉందని డాక్టర్లు నిర్ధారించారని చెప్పారు.
అయితే, కొద్ది రోజులుగా మోర్తజా కొడుకు సోహెల్(ఏడాది వయసు) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. గురువారం మోర్తజాకు కూడా తీవ్ర జ్వరం వచ్చింది. ఇప్పటికీ జ్వరం ఎక్కువగా ఉందని చౌదరి చెప్పారు.