ఢాకా: న్యూజీలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మళ్లీ జట్టులో చోటు సంపాదించాడు. గాయం కారణంగా టీమిండియాతో టీ20 సిరీస్ మొత్తానికీ దూరమైన గప్టిల్.. బంగ్లాదేశ్ తో ఆడబోయే జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్ పర్యటన ముగిసిన వెంటనే .. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు న్యూజీలాండ్ కు వెళ్లనుంది. బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టెస్ట్ మ్యాచ్ లల్లో న్యూజీలాండ్ తో తలపడుతుంది.
ఇందులో భాగంగా.. తొలి వన్డే కోసం ఈ నెల 13న రెండు జట్లు నేపియర్ లో తలపడబోతున్నాయి. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఈ సిరీస్ కు దూరం అయ్యాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో ఆడుతున్న సమయంలో షకిబ్ గాయపడ్డాడు. అతని వేలికి గాయమైంది. ఎముక చిట్లినట్టు డాక్టర్లు గుర్తించారు.
న్యూజీలాండ్ పర్యటన మొత్తానికీ షకిబ్ అందుబాటులో ఉండే అవకాశం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ దేబాశీష్ చౌధరి తెలిపారు. షకీబ్ కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుందని ఆయన అన్నారు. గాయం కారణంగా భారత్ తో టీ20 సిరీస్ కు దూరమైన కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అతను భారత్ తో చివరి టీ20 మ్యాచ్ లో ఆడబోవట్లేదని న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
బంగ్లాదేశ్ తో ఆడబోయే న్యూజీలాండ్ క్రికెట్ జట్టు ఇదీ: కేన్ విలియమ్సన్ (కేప్టెన్), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, కొలిన్ మున్రో, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోల్స్, రాస్ టేలర్, మిఛెల్ శాట్నర్, టిమ్ సౌథీ.