లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచ్లో మరో క్రికెట్ జట్టు జెర్సీ రంగు మారింది. లండన్లోని లార్డ్స్ గ్రౌండ్స్లో శుక్రవారం పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు ఎరుపు రంగు జెర్సీలతో కనిపించారు. నిజానికి- ఒకే రంగు జెర్సీలు ధరించిన ఏ రెండు జట్లు కూడా మ్యాచ్ ఆడకూడదనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధన. పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెటర్ల జెర్సీలు రెండు ఆకుపచ్చరంగులోనే ఉంటాయి. కొద్దిపాటి తేడా ఉంటుందంతే. ఈ ఉద్దేశంతోనే- బంగ్లాదేశ్ క్రికెటర్ల జెర్సీ రంగును మార్చారు. ఎరుపురంగు జెర్సీతో వారు మ్యాచ్ను ఆడుతున్నారు.
హైదరాబాద్ అల్లుడు షోయబ్ మాలిక్కు వసీం అక్రమ్ చురకలు: ఫేర్వెల్ డిన్నర్ ఇవ్వొచ్చు గానీ..!
ఇంతకుముందు- ఈ కారణంతోనే టీమిండియా సైతం జెర్సీ రంగును మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు ఆరంజ్ రంగు జెర్సీని ధరించారు. దీనికి కారణం- మన వాళ్లు ధరించిన నీలం రంగు జెర్సీ.. ఇంగ్లండ్ క్రికెటర్ల జెర్సీలను పోలి ఉండటమే. ఈ నేపథ్యంలో- జెర్సీల్లో రంగుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లోనూ పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు ఎరుపు రంగు జెర్సీలనే ధరించారు.