
తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు
2011 నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తనపై నమ్మకం ఉంచి పలు రకాల బాధ్యతలు అప్పజెప్పడం పట్ల ముష్పికర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. జట్టుతో పాటు ఉంటూ సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపటాన్ని ఇష్టపడుతున్నానని చెప్పాడు. కెప్టెన్నీ అనేది తన చేతుల్లో లేదని, తనని కెప్టెన్ ఉంచాలన్నా, తీసేయాలన్నా బోర్డు నిర్ణయంపై ఆధారపడుతుందని చెప్పాడు.

టీమిండియాకు టెయిలెండర్లే బలం
టీమిండియాకు టెయిలెండర్లే బలమని ముష్పికర్ అన్నాడు. బంతితో రాణిస్తూ, అవసరమైనప్పుడు టీమిండియా టెయిలెండర్లు నిలకడగా రాణిస్తున్నారని అన్నాడు. ఏ జట్టులోనైనా స్పిన్నర్లు లేదా పేసర్లు వైవిధ్యమైన బంతులు విసురుతూ ఆకట్టుకుంటారని, కానీ టీమిండియాలో మాత్రం స్పిన్నర్లు బంతిని అన్ని వైపులా తిప్పడంతో పాటు పేసర్లు పిచ్ను తమకు అనుకూలంగా మలచుకుంటూ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తున్నారని చెప్పాడు.

భారత్తో ఆడటం మాకు లాభించింది
ఫీల్డింగ్లో టీమిండియా తప్పులు చేయడం లేదని అన్నాడు. బ్యాట్స్ మన్ కొట్టిన బంతి కోసం ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారని అన్నాడు. ఇన్ని సానుకూలాంశాలు ఉన్నాయి కనుకే భారత జట్టు వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచిందని కితాబునిచ్చాడు. భారత్ తో ఆడడం తమకు లాభించిందని చెప్పాడు.

అనుభవలేమితో చిన్న చిన్న తప్పిదాలు
తమ లోపాలు తెలిశాయని చెప్పాడు. భారత్కు తాము తేలిగ్గా లొంగలేదని చెప్పాడు. మరొక్క సెషన్ ఆడి ఉన్నా, భారత్ను తొలి ఇన్నింగ్స్లో 500 పరుగులకు నియంత్రించినా పరిస్థితి వేరేలా ఉండేదని అన్నాడు. అనుభవలేమితో పాటు, ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలు తమను ఓటమిపాలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications











