న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరేబియన్ గడ్డపై గర్జించిన బంగ్లా పులి: 2-1తో టీ20 సిరిస్ కైవసం

By Nageshwara Rao
Bangladesh beat world champions West Indies to take T20 series 2-1

హైదరాబాద్: ఆతిథ్య వెస్టిండిస్‌తో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించిన మూడు టీ20ల సిరిస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య వెస్టిండిస్ జట్టుకు వరుణుడు 18వ ఓవర్‌లో అంతరాయం కలిగించాడు. ఈ క్రమంలో వర్షం వచ్చిన ఆట నిలిచిపోయే సమయానికి విండిస్ 17.1 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది.

Bangladesh beat world champions West Indies to take T20 series 2-1

వెస్టిండిస్ విజయానికి 17 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, ఎంతసేపటికీ వర్షం తగ్గక పోవడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 19 పరుగుల తేడాతో బంగ్లాదే విజయమని ప్రకటించారు. దీంతో వరుసగా రెండు టీ20లను గెలుచుకున్న బంగ్లా.. సిరీస్‌ కైవసం చేసుకుంది.

1
43706

ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్ లిటన్ దాస్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 61 పరుగులతో రాణించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లిటన్ దాస్‌నే వరించింది.

ఇక, ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌ వరించింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన బంగ్లాదేశ్‌ వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకోవడం గమనార్హం.

Story first published: Monday, August 6, 2018, 15:01 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X