న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ గ్రేటెస్ట్‌ను వెన‌క్కి నెట్టిన బాబ‌ర్ ఆజ‌మ్‌: శిఖ‌ర్‌, కోహ్లీ రికార్డుల‌నూ దాటేశాడు!

Babar Azam became the second fastest to 3,000 ODI runs

బ‌ర్మింగ్‌హామ్‌: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో వ‌రుస రికార్డులు న‌మోదవుతున్నాయి. పాత రికార్డులు చ‌రిత్ర పుట‌ల్లోకి ఎక్కేస్తున్నాయి. మ్యాచ్, మ్యాచ్‌కూ స‌రికొత్త రికార్డులు పుట్టుకొస్తున్నాయి. పాకిస్తాన్ టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ బాబ‌ర్ ఆజ‌మ్ అంత‌ర్జాతీయ వ‌న్డే మ్యాచుల్లో చెరిగిపోని, ఇప్ప‌ట్లో ఎవ‌రూ సాధించ‌లేని అరుదైన‌ రికార్డును నెల‌కొల్పాడు. వ‌రుస రికార్డుల‌ను న‌మోదు చేస్తున్నాడు. ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో బుధ‌వారం న్యూజీలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నాడు. అంత‌ర్జాతీయ వ‌న్డే మ్యాచుల్లో అతి వేగంగ 3000 ప‌రుగులు మైలురాయిని అందుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా బాబ‌ర్ ఆజ‌మ్ ఆవిర్భ‌వించాడు. ఈ క్ర‌మంలో- వెస్టిండీస్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్‌, లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌ర్ వివియ‌న్ రిచర్డ్స్ ను సైతం అత‌ను వెన‌క్కి నెట్టేశాడు. విరాట్ కోహ్లీ రికార్డును కూడా అధిగ‌మించేశాడు.

68 మ్యాచుల్లో 3000 ప‌రుగులు

న్యూజీలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సెంచ‌రీని న‌మోదు చేసిన బాబ‌ర్ ఆజ‌మ్‌.. ప్ర‌స్థానంలో కొన్ని చెరిగిపోని రికార్డులు న‌మోదు అయ్యాయి. అతివేగంగా 3000 ప‌రుగుల మైలురాయిని అందుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడత‌ను. ద‌క్షిణాఫ్రికా డాషింగ్ ఓపెన‌ర్ హ‌షీమ్ ఆమ్లా ఒక్క‌డే అత‌ని కంటే ముందున్నాడు. హ‌షీమ్ ఆమ్లా 57 మ్యాచుల్లోనే 3000 ప‌రుగుల‌ను అందుకున్న విష‌యం తెలిసిందే. 3000 ప‌రుగులను అందుకునే క్ర‌మంలో వెస్టిండీస్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్ స‌ర్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ సైతం తుడిచి పెట్టుకుపోయింది. 69 మ్యాచుల్లో వివియ‌న్ రిచ‌ర్డ్స్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే బాబ‌ర్ ఆజ‌మ్ 3000 ప‌రుగుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

శిఖ‌ర్ ధావ‌న్‌, విరాట్ కోహ్లీ.. సైతం అత‌ని వెన‌క్కే

భార‌త క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీని సైతం అధిగ‌మించేశాడు బాబ‌ర్ ఆజ‌మ్‌. 3000 ప‌రుగులను అందుకోవ‌డానికి విరాట్ కోహ్లీ 75 మ్యాచ్‌ల‌ను ఆడాల్సి వ‌చ్చింది. టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సైతం 72 మ్యాచ్‌ల‌ను తీసుకున్నాడు. వారంద‌ర్నీ దాటేశాడు బాబ‌ర్ ఆజ‌మ్. బాబ‌ర్ ఆజ‌మ్ న్యూజీలాండ్‌తో న‌మోదు చేయ‌డం సెంచ‌రీ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇదే తొలిసారి కాగా, అత‌ని కేరీర్‌లో ప‌ద‌వ‌ది. ఈ సెంచ‌రీ స‌హాయంతో పాకిస్తాన్ అలవోకగా న్యూజీలాండ్ విధించిన లక్ష్యాన్ని అందుకోగలిగింది. సెమీఫైన‌ల్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుక‌గ‌లిగింది. త‌న త‌దుప‌రి మ్యాచ్‌లల్లో పాకిస్తాన్ త‌న కంటే చిన్న జట్ట‌ను ఎదుర్కోనుంది. ఇది ఓ ర‌కంగా పాకిస్తాన్‌కు లాభించే విష‌య‌మే.

1
43676

{headtohead_cricket_4_5}

Story first published: Thursday, June 27, 2019, 7:33 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X