ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వెడ్ కు కరోనా సోకింది. బుధవారం సాయంత్రం అతనికి కోవిడ్ పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా అక్టోబర్ 28న మెల్ బోర్న్ లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. వెడ్ పరిస్థితి క్షీణించకపోతే ఇంగ్లాండ్తో ఆడతాడని భావిస్తున్నారు.
క్రికెట్.కామ్.au ప్రకారం మాథ్యూ వెడ్ కు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. ICC నిబంధనల ప్రకారం, కోవిడ్-19కి పాజిటివ్ వచ్చినా.. ఆటగాడు మ్యాచ్లు ఆడొచ్చట. ఆస్ట్రేలియా జట్టులో మొదటగా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు కరోనా సోకింది. దీంతో మంగళవారం శ్రీలంకతో మ్యాచ్కు జంపా దూరమయ్యాడు.
జంపా శుక్రవారం ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. అతను జంక్షన్ ఓవల్లో నెట్స్లో బౌలింగ్ చేయడం కూడా కనిపించింది. పలు నివేదికల ప్రకారం లెన్ మాక్స్వెల్ గురువారం వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆస్ట్రేలియాకు మరో స్పెషలిస్ట్ వికెట్కీపర్-బ్యాటర్ లేనందున వేడ్ అందుబాటులో లేనట్లయితే డేవిడ్ వార్నర్ గ్లవ్స్ తీసుకోవచ్చని కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెప్పాడు.
15 మంది సభ్యులతో కూడిన జట్టులో రెండో వికెట్ కీపర్గా ఎంపికైన జోష్ ఇంగ్లీస్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతనికి గోల్ఫ్ ఆడుతుండగా చేతికి గాయమైంది. దీంతో అతను వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్ జట్టులోకి వచ్చాడు. వెడ్ శుక్రవారం ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఆడితే అతను వేరుగా గ్రౌండ్ కు రావాల్సి ఉంటుంది.