
హోటల్ సిబ్బందికి కరోనా:
మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్లేయర్స్ బస చేస్తున్న గ్రాండ్ హయత్ హోటల్లో బుధవారం ఓ కార్మికుడికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆ హోటల్లో ఉన్న మొత్తం 600 మంది క్వారంటైన్లోకి వెళ్లారు. ఇందులో ప్లేయర్స్, అధికారులు మరియు సహాయక సిబ్బంది ఉన్నారు. టోర్నీ ప్రారంభం కావడానికి నాలుగు రోజుల ముందు ఇలా జరగడం ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులలో ఆందోళన కలిగిస్తోంది. విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ హోటల్ సిబ్బందికి కరోనా సోకిందని, రాష్ట్రంలో 28 రోజుల్లో ఇదే తొలి కేసు అని చెప్పారు.

ఆరు టోర్నీల మ్యాచ్లు వాయిదా:
గ్రాండ్స్లామ్ టోర్నీకి సన్నాహకంగా మెల్బోర్న్లో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఆరు టోర్నీలు జరుగుతున్నాయి. ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్లో ఫైర్ డిపార్మెంట్కు చెందిన సిబ్బందికి వైరస్ సోకడంతో.. ఆ హోటల్లో బస చేసిన ప్లేయర్స్ గురువారం ఈ టోర్నీలలో ఆడే మ్యాచ్లన్నీ వాయిదా వేశారు. మళ్లీ వారందరికీ పరీక్షలు చేసి.. నెగెటివ్ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు.

క్వారంటైన్లోకి 600 మంది:
'గ్రాండ్ హయత్ హోటల్లో పనిచేస్తున్న ఫైర్ డిపార్మెంట్కు చెందిన సిబ్బందికి జనవరి 29న జరిపిన పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. అనంతరం ఫిబ్రవరి 3న పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో హోటల్లో బస చేస్తున్న 500 నుంచి 600 మందిని క్వారంటైన్లోకి పంపారు. వారందరికీ పరీక్షలు చేసి.. నెగెటివ్ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. సోమవారం ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్పై ఈ ప్రభావం ఏమీ ఉండదు' అని డేనియల్ ఆండ్రూస్ తెలిపారు.

భారత్ నుంచి సుమిత్ నగాల్:
ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత్ నుంచి సుమిత్ నగాల్, రామ్కుమార్, ముకుంద్, బోపన్న, దివిజ్ శరణ్ లాంటి భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడుతున్నారు. అందరూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పురుషుల సింగిల్స్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), మహిళల సింగిల్స్లో సెరెనా విలియమ్స్ (యుఎస్) టైటిళ్లు గెలుస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
టీమిండియాతో సిరీస్ అయితే ఇలానే చేస్తారా?.. క్రికెట్ ఆస్ట్రేలియాపై వాన్ ఫైర్!!


Click it and Unblock the Notifications












