
టీ20 ప్రపంచ కప్ 2022 ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెలరేగి ఆడాడు. 43 బంతుల్లో 2 సిక్స్ లు 7 ఫోర్లతో 62 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్
కేప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్ను ఆరంభించారు. ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై అటాక్కు దిగారు. ప్రత్యేకించి- కేఎల్ రాహుల్ చెలరేగాడు. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్ స్న్ 4
వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్ వెల్, అగర్, స్టార్క్ ఒక్కో వికెట్ తీశారు.
మిచెల్ మార్ష్
186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. మిచెల్ మార్ష్ 18 బంతుల్లో 2 సిక్స్ లు, నాలుగు ఫోర్లతో 35 పరుగులు చేయగా.. అతన్ని భువనేశ్వర్ పెవిలియన్ కు పంపాడు. స్టీవ్ స్మీత్ 11 పరుగులకే ఔటయినా ఫించ్, మ్యాక్స్ వెల్ కలిసి ధాటిగా ఆడుతున్నాడు.