
డబ్బులు తీసుకోలేదు
మ్యాచ్ అనంతరం బ్రిస్బేన్ ఫైవ్స్టార్ హోటల్ నుంచి ఐదుగురు పాక్ ఆటగాళ్లు ఓ క్యాబ్ను భారత రెస్టారెంట్కు బుక్ చేసుకున్నారు. హోటల్ వద్దకు వెళ్లాక క్యాబ్ డ్రైవర్కు తెలిసింది వారు సాధారణ ప్రయాణికులు కాదని. ఇండియన్ రెస్టారెంట్ దగ్గర దింపాక పాక్ ఆటగాళ్లు డబ్బులు ఇవ్వబోగా డ్రైవర్ నిరాకరించాడు. ఆ క్యాబ్ డ్రైవర్ వారిపై గౌరవంతో డబ్బు తీసుకోలేదు.
డ్రైవర్కు పాక్ క్రికెటర్ల విందు:
దీంతో పాక్ ఆటగాళ్లు షాహిన్ షా, యాసిర్ షా, నసీమ్ షాలతో పాటు మరో ఇద్దరు ఆ డ్రైవర్ను తమ వెంట రెస్టారెంట్కు తీసుకెళ్లి విందు ఇచ్చారు. ఈ విషయాన్ని ఏబీసీ రేడియో ప్రెజెంటర్ అలీసన్ మిచెల్.. ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్కు లైవ్లో తెలియజేసింది. అలిసన్ మిచెల్కు ఈ విషయాన్ని స్వయంగా ఆ క్యాబ్ డ్రైవరే చెప్పాడట.

పాక్ ఆటగాళ్లపై ప్రశంసలు:
అలిసన్ మిచెల్ కూడా అదే క్యాబ్లో భారత్-పాకిస్థాన్ టెస్టు మ్యాచ్ సందర్భంగా స్టేడియానికి వస్తుంటే డ్రైవర్ తన సంతోషాన్ని తనతో పంచుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ప్రస్తుతం ఆసీస్-పాక్ దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో పాక్ ఆటగాళ్ల తీరు అందరి మన్ననలు అందుకుంటోంది.

ఆసీస్ ఘన విజయం:
ఆదివారం పూర్తైన తొలి టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. కంగారూ పేసర్లు హజిల్వుడ్ (4/63), స్టార్క్ (3/73), కమిన్స్ (2/69) ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్లో 335 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 240 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 580 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో టెస్టు డే/నైట్ కాగా శుక్రవారం ఆడిలేడ్లో జరగనుంది.


Click it and Unblock the Notifications
