
219 పరుగులు, 6 వికెట్ల దూరంలో
నాలుగో రోజు 153/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటై, ఆసీస్కు 323 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఆదివారం ఆట ముగిసిన అనంతరం విజయానికి కంగారూలు 219 పరుగులు, 6 వికెట్ల దూరంలో నిలిచింది ఆసీస్. షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను ఆదుకున్న హెడ్ను ఛేదనలో ఎంత తొందరగా ఔట్ చేస్తే భారత్ అంత వేగంగా విజయాన్ని అందుకునే ఛాన్స్ ఉంది. ఆఖరి రోజు కూడా భారత బౌలర్లు ఇదే జోరుతో బౌలింగ్ చేస్తేనే ఫలితం ఉంటుంది.

టాపార్డర్ కుప్పకూల్చిన ఔట్ చేసిన అశ్విన్
ఛేదనలో ఆసీస్కు శుభారంభం దక్కలేదు. 12వ ఓవర్లో అరోన్ ఫించ్(11)ను అశ్విన్ పెవిలియన్ చేర్చి దెబ్బతీశాడు. ఆతిథ్య బ్యాట్స్మెన్ ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మార్కస్ హారీస్(26)ను షమీ, ఉస్మాన్ ఖవాజా(8)ను అశ్విన్ ఔట్ చేసి టాపార్డర్ కుప్పకూల్చారు. తర్వాత హాండ్స్కాంబ్, షాన్ మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా వేట కొనసాగించారు. ఈ జోడీని మహ్మద్ షమీ విడదీశాడు.

లోయర్ ఆర్డర్ అద్భుత పోరాటం చేస్తేనే
ఆఖర్లో షాన్ మార్ష్(31), ట్రావిస్ హెడ్(11) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆటకు సోమవారమే ఆఖరి రోజు, కంగారూలు ఓటమి తప్పించుకోవాలంటే లోయర్ ఆర్డర్ అద్భుత పోరాట నైపుణ్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆసీస్ గెలవాలంటే మరో 219 పరుగులు చేయాల్సి ఉంది.

భారత ఇన్నింగ్స్ ఎలా ముగిసిందంటే:
ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న పుజారా (71).. కాసేపటికే స్పిన్నర్ లియాన్ బౌలింగ్లో షార్ట్ లెగ్లో ఫించ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు రహానె (70) ఆసీస్ బౌలర్లను దాటిగా ఎదుర్కొని కేరీర్లో 16వ అర్ధశతకం నమోదు చేశాడు. అతడికి మిగితా బ్యాట్స్మెన్ సహకారం లేకపోవడంతో భారీ షాట్కు ప్రయత్నించి లియాన్ బౌలింగ్లో స్టార్క్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ (1), పంత్ (28), షమీ (0) లియాన్ బౌలింగ్లో, అశ్విన్ (5), ఇషాంత్ (0)లు స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యారు.


Click it and Unblock the Notifications












