|
మయాంక్తో పాటు భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ను కూడా
కేవలం మయాంక్నే కాదు అతనితోపాటు ఇండియా ఫస్ట్క్లాస్ క్రికెట్(రంజీ) గురించి కూడా తక్కువ భావంతో మాట్లాడాడు. షేన్వార్న్, మార్క్ హోవార్డ్లతో కలిసి ఫాక్స్ స్పోర్ట్స్ చానెల్కు ఓకీఫ్ కామెంటరీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్క్లాస్ క్రికెట్లో మయాంక్ ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రస్తావించారు. దీనిపై ఓకీఫ్ స్పందిస్తూ.. అతడు క్యాంటీన్ సిబ్బంది లేదా వెయిటర్స్పై ఈ 304 పరుగులు చేసి ఉంటాడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
|
క్యాంటిన్ సభ్యులతో ట్రిపుల్ సెంచరీ
ఈ కామెంట్పై భారత అభిమానులు అతనిపై ధ్వజమెత్తారు. ఓకీఫ్పై ట్వీట్లతో తిట్ల వర్షం కురిపించారు. మయాంక్ అగర్వాల్ గతేడాది మహారాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. భారత జట్టు ఎంచుకోవడంలో ఈ ప్రదర్శన కూడా కీలకంగానే వ్యవహరించింది. అటువంటి ప్రాముఖ్యమైన ఇన్నింగ్స్ పట్ల చులకన భావంతో మాట్లాడటం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది.
|
భారత్లో 50 అంటే ఇక్కడ 40
ఈ లెక్కన భారత్ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని కూడా ఓకీఫ్ అవమానించినట్లేనని అభిమానులు మండిపడుతున్నారు. ఓ క్రికెట్ జర్నలిస్ట్ కూడా ఓకీఫ్ కామెంట్స్ను తప్పుబట్టారు. మరోవైపు ఇదే మ్యాచ్లో కామెంటరీ ఇస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ వా కూడా మయాంక్పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. భారత ఫస్ట్క్లాస్ క్రికెట్లో 50 సగటు అంటే ఆస్ట్రేలియాలో 40 సగటు కిందికి వస్తుందని మార్క్ వా నోరుపారేసుకున్నాడు. విమర్శల దాడికి తట్టుకోలేక మరి కాసేపటికి తన ఉద్దేశ్యం అది కాదంటూ ట్విటర్లోనే వివరణ ఇచ్చుకున్నాడు.