హైదరాబాద్: జనవరి 12 నుంచి టీమిండియాతో జరిగే మూడు వన్డేల సిరిస్కు ఆసీస్ పేస్ బౌలర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోస్ హేజెల్వుడ్ దూరమయ్యారు. 2019లో ఎక్కువ క్రికెట్ ఆడాల్సి ఉండటంతో వీరి పని భారాన్ని తగ్గించాలనే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది.
బుమ్రా బెస్ట్ బౌలర్... నేను కూడా ఎదుర్కోలేను: కోహ్లీ
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ జరుగుతుంది. మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కోహ్లీసేన 2-1 ఆధిక్యంలో నిలిచింది.
ఈ ముగ్గురికి విశ్రాంతిని ఇవ్వడంపై ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "ఎవరిని ఎంపిక చేయాలో గందరగోళంగా ఉంది. మా బౌలర్ల పనిభారాన్ని పర్యవేక్షించాల్సి ఉంది. ఆ ముగ్గురికి వన్డే సిరీస్లో విశ్రాంతినిస్తే తర్వాతి రెండు టెస్టులకు ఉత్సాహంగా ఉంచగలం" అని అన్నాడు.
"బాక్సింగ్ డే టెస్టులో కమిన్స్ అద్భుతంగా ఆడాడు. ప్రతి మ్యాచ్కు అతడిని ఎందుకు ఎంపిక చేయరని మీరు ప్రశ్నిస్తారు? కానీ మనకు వచ్చే ఏడాది వరల్డ్కప్, యాషెస్ ఉన్నాయి. అందుకే కమిన్స్ను ఉల్లాసంగా, తాజాగా ఉంచడం మా బాధ్యత" అని హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు.
కాగా, బాక్సింగ్ డే టెస్టులో కమ్మిన్స్ అటు బ్యాట్తో పాటు, ఇటు బంతితోనూ రాణించి భారత విజయాన్ని ఆలస్యం చేసిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ముగిసిన అనంతరం జనవరి 12 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. తొల వన్డే మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది.