మెల్ బోర్న్: ఆస్ట్రేలియా తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టుకు కష్టాలు తప్పేట్టు లేవు. ఆస్ట్రేలియా జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు నష్టపోయి 351 పరగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత జట్టు ముందు 499 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆటకు మరో రెండు రోజులు మిగిలిఉంది. ఆస్ట్ర్రేలియా రెండవ ఇన్నింగ్స్లో జాక్వెస్, క్లార్క్ అర్థ సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో హర్భజన్ మూడు వికెట్లు పడగొట్టగా, అనిల్ కుంబ్లే రెండు వికెట్లు పడగొట్టాడు.499 పరుగుల భారీ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.