వరల్డ్ కప్కి ముందు జరుగుతున్న చివరి సిరీస్
వరల్డ్ కప్కి ముందు జరుగుతున్న చివరి సిరీస్ కావడం.. దినేశ్ కార్తీక్కు చోటు ఇవ్వకపోవడంతో అతడు వరల్డ్ కప్లో ఆడటం అనుమానంగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్కు దినేశ్ కార్తీక్ను ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. స్కూల్ పిల్లల్లాగా ఈ పాలిటిక్స్ ఏంటని నిలదీస్తున్నారు.
కేఎల్ రాహుల్, కార్తీక్లలో ఎవరిని ఎంపిక చేస్తారు?
కేఎల్ రాహుల్, కార్తీక్లలో ఎవరిని ఎంపిక చేస్తారని అడిగితే దాదాపు అందరూ కార్తీక్ వైపే మొగ్గు చూపుతారు. ఏడాది కాలంగా కార్తీక్ నిలకడగా ఆడుతున్నాడని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... కార్తీక్ను తప్పించి, దేని ఆధారంగా రాహుల్కు చోటిచ్చారని చెప్పాలంటూ మరొక నెటిజన్ డిమాండ్ చేశాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ
ఇక, జట్టు ప్రకటన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లపై పరిమిత ఓవర్ల సిరీస్లో కార్తీక్కు అవకాశం కల్పించాం. సొంత గడ్డ మీద ఆసీస్తో సిరీస్లో పంత్కు ఛాన్సిస్తున్నాం. వీరి ప్రదర్శనను అంచనా వేసి వరల్డ్ కప్ ముందు నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications

