సిడ్నీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడి సాయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఏ) కోరింది! 2000 కాలంలో శ్రీరామ్ శ్రీధరన్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను ఎనిమిది వన్డేలు ఆడాడు. తమిళనాడుకు చెందిన ఇతను ఆ తర్వాత కనుమరుగయ్యాడు.
2004లో చివరి వన్డే ఆడాడు. ఆ తర్వాత అతను కనిపించలేదు. నాలుగేళ్ల క్రితం రిటైరయ్యాడు. ఆ శ్రీరామ్ను వచ్చే ట్వంటీ 20 ప్రపంచకప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా సలహాదారుగా నియమించుకుంది.

ఆస్ట్రేలియా ఎ జట్టు ఈ ఏడాది భారత్లో పర్యటించినపుడు శ్రీరామ్ సాయం తీసుకున్నామని, ట్వంటీ 20 ప్రపంచ కప్ సందర్భంగా భారత్లో పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో తమ ఆటగాళ్లకు అతను అవగాహన కల్పిస్తాడని చెప్పింది.
శ్రీరామ్ శ్రీధరన్ ఆల్ రౌండర్. 200-2004 మధ్య భారత జట్టుకు ఎనిమిది వన్డేలు ఆడాడు. ఇతని వయస్సు 39 ఏళ్లు. భారత్లో ఎదుర్కొనే పరిస్థితుల పైన శ్రీరామ్ తమ ఆటగాళ్లను ప్రిపేర్ చేసే విషయంపై దృష్టి సారించాడని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన హోవార్డ్ చెప్పాడు.