దుబాయ్: ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తిరిగి అగ్రస్థానానికి ఎగబాకింది. భారత్ క్రికెట్ జట్టు రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండుతో జరుగుతున్న ఏడు మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా ఆరు మ్యాచులో గెలిచింది. దీంతో ఆస్ట్రేలియా వన్డే ర్యాంకింగ్ లో పైకి ఎగబాకింది. ఇంగ్లాండుతో జరిగిన ఆరో వన్డే మ్యాచులో రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 111 పరుగుల తేడాతో గురువారం విజయం సాధించింది. రేటింగ్ లో దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా అధిగమించింది. ఏడో మ్యాచులో కూడా గెలిస్తే ఆస్టేలియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఇంగ్లాండు గెలిస్తే మళ్లీ మూడో స్థానానికి పడిపోతుంది.